Surekhavani : నటి సురేఖ వాణి జీవితంలో ఇంత విషాదం దాగుందా…?

131

Surekhavani : పలు టాలీవుడ్ చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా అలరించిన తెలుగు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి సురేఖవాణి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో తన కూతురు సుప్రీత తో కలిసి బాగానే పాపులర్ అవుతోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు ట్రెండింగ్ లో ఉన్నటువంటి పాటలకి డాన్స్ లు వేయడం వంటివి చేస్తూ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంటోంది. అయితే నటి సురేఖ వాణి భర్త కూడా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి అని ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

అయితే నటి సురేఖవాణి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పరిసర ప్రాంతంలో పుట్టి పెరిగింది. దీంతో తన చదువు పూర్తయిన తర్వాత నటనపై ఆసక్తి కలగడంతో ఇండస్ట్రీ కి వచ్చింది. ఈ క్రమంలో అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా ఛానల్ లో కొంతకాలం పాటు పని చేసింది. ఆ తర్వాత 2005వ సంవత్సరంలో ప్రముఖ సీనియర్ దర్శకుడు పూసల రాధాకృష్ణ దర్శకత్వం వహించిన శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ అనే ఈ చిత్రంలో నటించి నటిగా తన సినీ కెరీర్ ని ఆరంభించింది. అయితే మా టీవీలో పనిచేస్తున్న సమయంలో అప్పటికే పలు రకాల షోలు మరియు సీరియళ్ల కి స్క్రిప్టు రైటర్ గా మరియు దర్శకుడిగా పని చేసినటువంటి ప్రముఖ స్వర్గీయ సీరియల్ డైరెక్టర్ సురేష్ తేజ ని ప్రేమించింది. దీంతో వీరిరువురి పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నారు.

పెళ్లయిన తర్వాత వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. దీంతో వీరికి సుప్రీత అనే ఒక పాప కూడా ఉంది. అయితే పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత డైరెక్టర్ సురేష్ తేజ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో చివరిరోజుల్లో సురేష్ తేజ ఇంట్లో కంటే ఆసుపత్రిలోనే ఎక్కువగా గడిపాడు. చివరికి 2019 వ సంవత్సరం మే నెల 6వ తారీఖున సురేష్ తేజ కన్ను మూసాడు. దీంతో నటి సురేఖ వాణి అప్పటి నుంచి సినిమాలో నటించడం కొంతమేర తగ్గించేసింది. అలాగే ప్రస్తుతం తన కూతురు భవిష్యత్తు పై దృష్టి సారించినట్లు సమాచారం.

కాగా నటి సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది. ఇటీవలే సుప్రీత ఓ ప్రముఖ వార్తా చానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి మరణించిన సమయంలో జరిగినటువంటి కొన్ని విషాదకర సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తన తల్లిదండ్రులకి తాను ఒక్కతే కూతురు కావడంతో తన తండ్రి భౌతికకాయానికి తల కొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని దాంతో తానే కొడుకుగా మారి తన తండ్రికి అంతక్రియలు చేశానని కొంతమేర ఎమోషనల్ అయ్యింది. అయితే తన తండ్రి సురేష్ తేజ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి లైఫ్ లీడ్ చేశాడని ఇది అర్థం చేసుకోనటువంటి కొందరు బంధువులు తన తండ్రి సురేష్ తేజ గురించి తప్పుడు ప్రచారాలు చేశారని వాపోయింది.

Previous articleANR : తన పంతం నెగ్గించుకోవడానికే ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించాడా…?
Next articleYamaleela : మహేష్ రిజెక్ట్ చేసిన సినిమాని కమెడియన్ తో తెరకెక్కించి హిట్ కొట్టిన డైరెక్టర్ ఎస్వి కృష్ణా రెడ్డి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here