Sridevi : అప్పట్లో హీరోయిన్ శ్రీ దేవి సినిమాల్లో నటించాడని కి అలాంటి కండిషన్లు పెట్టేదట…

698

Sridevi : 19వ శతాబ్ద కాలంలో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది ప్రముఖ నటి శ్రీదేవి. అయితే నటి శ్రీదేవి సినిమాల్లోకి రాక ముందు కొంతకాలం పాటు మోడలింగ్ రంగంలో కూడా పని చేసింది. ఇందులో భాగంగా 1999వ సంవత్సరంలో విశ్వసుందరిగా అవార్డు కూడా దక్కించుకుంది. అయితే నటి శ్రీదేవి చిన్నప్పుడు ప్రముఖ నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు తో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా మరియు హీరోయిన్ గా నటించింది. దీంతో అప్పటి హయాంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సూపర్ స్టార్ కృష్ణ మరియు నేటి హయాంలో చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ తదితర స్టార్ హీరోలతో కలిసి నటించింది.

ఈ క్రమంలో నటి శ్రీదేవి కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాకుండా హిందీ, తమిళం, మలయాళం తదితర భాషలలో కూడా నటించి దేశ వ్యాప్తంగా అభిమానాన్ని సంపాదించుకుంది. కాగా నటి శ్రీదేవి బోనీ కపూర్ ని 1996వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన తర్వాత కూడా నటి శ్రీదేవి అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ పై దృష్టి సాధించలేకపోయింది. కానీ అప్పటికే నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి బాగానే ఆస్తులు కూడబెట్టారు. దీంతో సినిమా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత నటి శ్రీదేవి తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే పనిలో పడింది.

అయితే గతంలో తెలుగు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రముఖ వెటరన్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్ర అవకాశం మొదటగా నటి శ్రీదేవి ని వరించిందట. కానీ నటి శ్రీదేవి శివగామి పాత్ర లో నటించాడానికి ఆమె పెట్టిన కండిషన్లు విని ఒక్కసారిగా చిత్ర యూనిట్ సభ్యులు అవాక్కయ్యారట. దీంతో ఈ విషయంపై ఆ మధ్య నటుడు రాజమౌళి కూడా యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో స్పందించాడు.

ఇందులో భాగంగా నటి శ్రీదేవి ఈ పాత్రలో నటించడానికి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అడిగిందని అంతటితో ఆగకుండా తాను షూటింగులో పాల్గొనే సమయంలో తనతోపాటు ఉన్నటువంటి సిబ్బందికి కూడా స్టార్ హోటళ్లలో బస ఏర్పాటు చేయాలని అలాగే బిజినెస్ క్లాస్ లో విమాన టికెట్లు కూడా బుక్ చేయాలని షరతులు పెట్టిందట. దీంతో ఈ పని చేస్తే చిత్ర బడ్జెట్ ఎక్కువ అవుతుందని చివరికి నటి శ్రీదేవి స్థానంలో రమ్యకృష్ణ ని తీసుకున్నామని తెలిపాడు రాజమౌళి.

నటి రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలపై శ్రీ దేవి (బ్రతికి ఉన్నప్పుడు) వార్తా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో స్పందించింది. ఇందులో భాగంగా దర్శకుడు రాజమౌళి తన రెమ్యునరేషన్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలలో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అంతేకాకుండా తన భర్త కూడా సినీ నిర్మాత అని దాంతో సినీ నిర్మాతల కష్టాలు కూడా తనకి బాగా తెలుసని అలాంటప్పుడు ఖరీదైన గొంతెమ్మ కోరికలను నేనెలా కోరుతానని ప్రశ్నించింది. అలాగే నిజానిజాలు తెలుసుకోకుండా తన గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని చెప్పుకొచ్చింది.

అయితే ఒకప్పుడు నటి శ్రీదేవి ని చూడడానికి అభిమానులు సినిమా థియేటర్లకి వెళ్లేవాళ్ళు. అంత క్రేజ్ ఉన్నటువంటి హీరోయిన్ శ్రీదేవి కి ఆమె అడిగినటువంటి రెమ్యునరేషన్ ఇవ్వడంలో తప్పేముందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా నటి శ్రీదేవి పెళ్లి వేడుకలో నిమిత్తమై దుబాయ్ దేశానికి వెళ్లి 2018 వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున తాను బస చేస్తున్నటువంటి హోటల్ లో బాత్రూం లో కాలు జారి పడి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది.

Previous articleది కశ్మీర్ ఫైల్స్ – సోషల్ మీడియాను ఊపేస్తున్న సినిమా, కన్నీరు తెప్పించే కథ
Next articleGangubai kathiawadi సినిమాలోని గంగూ భాయ్ గురించి ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here