పాల లారీలో నిఖార్సయిన మద్యం బాటిళ్లు

132

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్పోస్ట్ వద్ద పాల వ్యాన్ లో తరలిస్తున్న 637 మద్యం బాటిళ్లను దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాచేపల్లి పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గురజాల రూరల్ సిఐ అచ్చయ్య మాట్లాడుతూ మాకు రాబడిన సమాచారం మేరకు తెలంగాణ నుండి ఆంద్రాకు వస్తున్న పాలలారీని ఆపి తనిఖీ చేయగా పాల లారీలో తరలిస్తున్న 637 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని వారు తెలిపారు. అక్రమంగా మద్యం తరలించడం నేరమని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. పట్టుకున్న మద్యం బాటిళ్ల విలువ లక్ష రూపాయలు వరకు ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాచేపల్లి ఎస్సై రహంతుళ్ల, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous articleఅవాంఛిత రోమాలకి శాశ్వత పరిష్కారం
Next articleఅందం – ఆరోగ్యం – శృంగార పటుత్వం పెంచే గింజలు…రోజుకి ఒక స్పూన్ చాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here