ఉదయాన్నే ఇది తినటంతో ఎలాంటి క్యాన్సర్ నైనా దూరం చేయవచ్చు

136

ఉదయాన్నే పరగడుపున ఖాళీకడుపుతో ఇది తింటే చాలు శరీరంలో క్యాన్సర్ నిరోధిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. మీ గుండె మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది మలబద్ధకాన్ని పోగొడుతుంది. అన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతుంది. డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచుతుంది జీర్ణశక్తిని పెంచి మన చర్మాన్ని జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అన్ని అద్భుతాలు చేస్తున్న ఈ చిట్కా ని ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం. దీనికోసం మనకు కావలసిన పదార్థం అవిసె గింజలు.

అవిసె గింజల లో ఎన్నో రకాలైన రోగాలను నివారించే అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఎక్కడైతే అవిసెగింజలు ప్రజలు తమ ఆహారంలో భాగంగా చేసుకుంటారో అక్కడ ఆరోగ్యం వెల్లివిరుస్తుంది అని మహాత్మా గాంధీ గారు కూడా అన్నారు. దీనిని బట్టే అవిసగింజల లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అర్థం చేసుకోవచ్చు. మన శరీరానికి కావలసిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి చాలా అరుదుగా లభిస్తాయి. కానీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఈ అవిసె గింజల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో మనకు కావలసినంత ఫైబర్ యాంటీఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అవిసె గింజల లో నీటిలో కరిగేవి కరగని రెండు రకాల ఫైబర్స్ ఉంటాయి. ఇవి మన పెద్దపేగు పాడవకుండా కాపాడతాయి. ఆరోగ్యం సరిగా లేకపోతే చర్మంపై రకరకాల సమస్యలు వస్తాయి. ఈ అవిసె గింజలు తినడం వల్ల మీ చర్మ సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. కొత్త చర్మ కణాలు పుట్టుకొచ్చి చర్మం కాంతివంతంగా యవ్వనం గా మారుతుంది. అవిసె గింజలు ఉదయాన్నే మనం తీసుకునే ఆహారంతో పాటు బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే మంచిది. ఇప్పుడు చెప్పబోయే విధంగా అవిస గింజలు కనుక తీసుకుంటే చాలా రుచిగా ఆరోగ్యంగా తినవచ్చు. ఆ చిట్కా ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని కోసం మనకు కావలసినది పెరుగు. ఒక బౌల్ తీసుకొని దానిలో రెండు లేదా మూడు స్పూన్ల పెరుగు తీసుకోవాలి. పెరుగులో ఉండే ఆరోగ్యప్రయోజనాలు అందరికీ తెలిసినవి. అవిసె గింజలను పెరుగుతో కలిపి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మరింత రెట్టింపు అవుతాయి. ఈ చిట్కా కోసం అవిసె గింజలను వేయించాల్సిన అవసరం కూడా లేదు నేరుగా తీసుకోవచ్చు. దానిని ముందుగా మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని సీసాలో 15 రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడిని రెండు స్పూన్ల మోతాదులో పెరుగులో కలుపుకొని ప్రతిరోజు పరగడుపున బ్రష్ చేసిన వెంటనే తినేయాలి. రుచికోసం కావాలంటే ఒక స్పూన్ తేనెను కూడా కలుపుకోవచ్చు. దీనితో ఇది మరింత రుచిగా అనిపిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనెను వాడకూడదు. అయితే ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి అవిసె గింజల పొడిని పెరుగుతో కలిపిన తరువాత ఎక్కువసేపు నిల్వ ఉంచకూడదు వెంటనే తినాలి. ఒక ఐదు నిమిషాల లోపే ఈ మిశ్రమాన్ని తినేయాలి. ప్రతిరోజు పరగడుపున తీసుకోవడం వల్ల మన జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ కారణంగా వచ్చే జలుబు దగ్గు నివారించడానికి కూడా ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. పెరుగు అవిసగింజల లో ఉండే మాంసకృత్తులు ఖనిజాలు శారీరక ఎదుగుదల కి వెంట్రుకలు బాగా పెరగడానికి సహాయ పడతాయి. ఉదయాన్నే మలవిసర్జన సాఫీగా జరగడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ అధిక కొవ్వును త్వరగా పెరిగే లాగ చేసి బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫర్మేషన్ నివారించి హృదయ సంబంధిత సమస్యలు కీళ్ళవాతం ఉబ్బసం మధుమేహం ఇంకా దీర్ఘకాలిక సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరాన్ని డిటాక్స్ చేసి రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల చర్మం జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా మారుతుంది. మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మహిళలకు ఈ చిట్కా చాలా మంచిది. ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని తింటే రుతుక్రమాన్ని కి ముందు తలెత్తే అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. రొమ్ము క్యాన్సర్ ను కూడా రాకుండా చేస్తాయి. ఇది అన్ని వయసుల వారికి చాలా మంచిది. వీటిలో ఆల్ఫా లినోలిక్ ఆసిడ్స కూడా ఉంటాయి. ఇవి మన మెదడుని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఈ అవిసె గింజల్లో ఉండే ఫైబర్ ఒమేగా త్రీ వంటివి మన గుండెకు చాలా మంచిది. దీనితో మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మనం తినే ఆహార పదార్థంలో ఓట్స్ సలాడ్స్ తో పాటు ఈ చిట్కాను కూడా పాటించి అవిసె గింజలను కూడా తినాలి. రక్తపోటు బీపి కంట్రోల్ లో ఉంటుంది దీని వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Previous articleఈ చిన్న చిట్కాతో చర్మ సంబంధిత సమస్యలు దూరం
Next articleఈ ఆకులో ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here