Bride cheating : ఇంటికొచ్చిన రోజే అలా చేసిన కొత్త కోడలు… దెబ్బకి అందరూ ఆసుపత్రిలో చేరారు…

178

Bride cheating : ఈ మధ్య కాలంలో కొందరు అడ్డదారిలో డబ్బులు సంపాదించడం కోసం ఇతరుల ప్రాణాలు తీయడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరికొందరైతే ఏకంగా ప్రేమ, పెళ్ళి వంటి బంధాలను ఉపయోగించుకుంటూ ధన, మాన, ప్రాణాలతో ఆడుకుంటూ ఇతరుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకుంటున్న సంఘటనలు నిజ జీవితంలో తరచూ చూస్తుంటాం. తాజాగా యువతి సులభంగా డబ్బు సంపాదించేందుకు తన శరీరాన్ని ఆయుధంగా చేసుకుని పెళ్లి కానటువంటి యువకులను టార్గెట్ చేస్తూ తన అందచందాలను ఎరగా వేసి అందినంత డబ్బు, నగలు దోచుకుంటూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని జైపూర్ పట్టణ పరిసర ప్రాంతంలో రణవీర్ (పేరు మార్చాం) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే రణవీర్ కి పెద్దగా చదువబ్బక పోవడంతో తన తండ్రికి ఉన్నటువంటి షాపులో చేదోడు వాదోడుగా నిలుస్తూ తన తండ్రి షాపులోనే పని చేసేవాడు. కాగా ఇటీవలే రణవీర్ కుటుంబ సభ్యులు తమ కొడుకు కి తగిన సంబంధం చూసి పెళ్ళి చేయాలని వధువు కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తనకుతానుగా వచ్చి పెళ్లిళ్ల పేరయ్యనని పరిచయం చేసుకున్నాడు. దీంతో రణవీర్ కుటుంబ సభ్యులతో తన వద్ద రణవీర్ కి సరిగ్గా సరిపోయేటువంటి మంచి వధువుల ఫోటోలు ఉన్నాయని కానీ తనకు సంబంధం కుదిరిన తర్వాత లక్ష రూపాయలకు లక్షకి పైగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపాడు. దీంతో రణవీర్ కుటుంబ సభ్యులు కూడా కొంతమేర బాగానే ఆర్థికంగా స్థిరపడి ఉండటంతో డబ్బుకు వెనుకాడవద్దని తమ కొడుకు రణవీర్ కి తగిన వధువు ని చూపిస్తే మంచి కమిషన్ ఇస్తామని పెళ్లిళ్ల పేరయ్యతో చెప్పారు.

దీంతో పెళ్ళిళ్ళ పేరయ్య కమిషన్ కోసం కక్కుర్తి పడి తనకు తెలిసిన ఓ యువతి సంబంధాన్ని సెట్ చేశాడు. ఈ క్రమంలో పెళ్ళి తంతు కూడా తానే దగ్గరుండి చూసుకున్నాడు. అనంతరం రణవీర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన మాట ప్రకారం దాదాపుగా ఒకటిన్నర లక్షల రూపాయలకు పైగా కమిషన్ పెళ్లిళ్ల పేరయ్య కి ఇచ్చారు. ఇక్కడ అంతా బాగానే ఉంది. అయితే పెళ్లయిన మూడు రోజుల తర్వాత కొత్త కోడలు చేసిన ఘనకార్యం చూసి ఒక్కసారిగా రణవీర్ కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రులు నిర్ఘాంత పోయారు. అయితే ఇంతకీ ఆ కొత్త కోడలు చేసినటువంటి పని ఏమిటంటే శోభనం రోజున తాను వంట చేస్తానని పసందైన వంటకాలు వండి తన భర్తతో పాటు అత్తమామలకు కూడా పెట్టింది. కానీ తాను మాత్రం తినలేదు. అయితే ఈ వంటలలో కొంతమేర విష పదార్థాలను కలిపింది.

ఇంకేముంది శోభనం చేసుకోవాల్సినటువంటి కొత్త పెళ్లి కొడుకు ఆస్పత్రి పాలయ్యాడు. ఈ క్రమంలో కోడలు ఇంట్లో ఉన్నటువంటి డబ్బు, నగలు మరియు ఇతర ఖరీదైన వస్తువులను తీసుకొని అక్కడినుంచి పారిపోయింది. దీంతో రణవీర్ కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా కమిషన్ కోసం కక్కుర్తి పడి ముందు వెనకా ఆలోచించకుండా ఈ సంబంధాన్ని సెట్ చేసినటువంటి పెళ్లిళ్ల పేరయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అలాగే డబ్బు బంగారం కోసం ఏకంగా తాళి కట్టిన భర్తని మరియు అతడి కుటుంబ సభ్యులను చంపాలని చూసిన కొత్త కోడలి ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా పెళ్లంటే నూరేళ్ల పంటని కానీ కొందరు డబ్బు, ఆస్తులపై ఉన్నటువంటి మోహం కారణంగా అపహాస్యం చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అలాగే పెళ్లి పేరుతో రణవీర్ ని దారుణంగా మోసం చెయ్యడంతో పాటూ చంపాలని చుసిన యువతిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.

Previous article6ఏళ్ళ క్రితం మొక్క ఇపుడు మహావృక్షం, చిన్న ఛానల్ గా ఉన్నప్పటి నుంచి నేను సుమన్ ను చూస్తున్నాను-చిరంజీవి
Next articleANR : తన పంతం నెగ్గించుకోవడానికే ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియోస్ ని నిర్మించాడా…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here