Vijayashanti అందుకే పిల్లల్ని కనలేదా..?

123

Vijayashanti : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ నాగార్జున తదితర స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు ప్రముఖ వెటరన్ హీరోయిన్ “విజయశాంతి” గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకి కొత్త గా తెలియజేయాల్సిన అవసరం లేదు. కాగా నటి విజయశాంతి తెలుగులో ప్రముఖ హీరో సూపర్ స్టార్ కృష్ణ 1980వ సంవత్సరంలో హీరోగా నటించిన “కిలాడి కృష్ణుడు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ అంతకుముందే ఇదే సంవత్సరంలో తమిళ భాషలో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కించిన “కళుక్కుళ్ ఈరమ్” అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ఆరంభించింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ నటి విజయశాంతికి కిలాడి కృష్ణుడు చిత్రం ద్వారా నటిగా గుర్తింపు లభించింది.

అయితే నటి విజయశాంతి తన సినీ కెరీర్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో అప్పట్లో తెలుగు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన “ఒసేయ్ రాములమ్మ” అనే చిత్రంలో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా అప్పటి నుంచి నటి విజయశాంతి కేవలం నటనా రంగంలో మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో కూడా చేరింది. ఈ క్రమంలో ఎన్నో ప్రజా సమస్యలపై పోరాటం చేసింది. కాగా నటి విజయశాంతి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ సీనియర్ నిర్మాత “ఎమ్ వి శ్రీనివాస్ ప్రసాద్” ని 1988వ సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే నిర్మాత ఎమ్ వి శ్రీనివాస్ ప్రసాద్ ప్రముఖ స్వర్గీయ నటుడు అన్నగారు నందమూరి తారక రామారావు కి దూరపు చుట్టం అవుతాడు. ఈ క్రమంలో నిర్మాత శ్రీనివాస్ ప్రసాద్ నందమూరి బాలకృష్ణ తో తెరకెక్కించిన నిప్పు రవ్వ అనే చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా విజయశాంతి నటించింది. దీంతో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో నటి విజయశాంతి మరియు నిర్మాత శ్రీనివాస్ ప్రసాద్ ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

అయితే విజయశాంతి మరియు శ్రీనివాస్ ప్రసాద్ పెళ్లి జరిగి దాదాపుగా 30 సంవత్సరాలు పైబడినప్పటికీ ఇప్పటికీ వీరికి పిల్లలు లేరు. దీంతో తాము ఎందుకు సంతానానికి దూరంగా ఉన్నామనే విషయంపై ఆ మధ్య నటి Vijayashanti ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఇందులో భాగంగా తనకి స్వార్ధం ఏమాత్రం లేదని అందువల్లనే తన ప్రజలనే తన పిల్లలుగా భావించి వారి కష్ట సుఖాలలో పలు పంచుకుంటూ తోచినంత సహాయం చేస్తూ ప్రజాసేవకై తన జీవితాన్ని అంకితం చేశానని చెప్పుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కారణం వల్లే తాను పిల్లల్ని కనడానికి దూరంగా ఉన్నానని స్పష్టం చేసింది.

ఈ విషయంపై మొదట్లో కొన్ని అభ్యంతరాలు వచ్చినప్పటికీ తను పెద్దగా పట్టించుకోలేదని అందువల్లనే ఎప్పుడూ కూడా ప్రజలకి ఎలాంటి సమస్య వచ్చినా పోరాటం చేస్తానని తెలిపింది. అలాగే తాను రాజకీయాల్లోకి రావడానికి కూడా ఇదే కారణమని అంతేతప్ప డబ్బు సంపాదించి ఎవరినో ఉద్దరించాలనే ఆశలు, కోరికలు లేవని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల వల్ల తాను తన జీవితంలో గడపడానికి కావలసినటువంటి డబ్బు ని సంపాదించుకున్నానని కాబట్టి తనకి డబ్బుపై పెద్దగా వ్యామోహం లేదని కూడా స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి తన సేవలు అందిస్తోంది.

అయితే ఆ మధ్య ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో దాదాపుగా పద్నాలుగేళ్ళ తర్వాత మళ్లీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి న నటిగా రీఎంట్రీ ఇచ్చింది. దీంతో మళ్ళీ నటి విజయశాంతి సినిమాల్లో రాణించడానికి సిద్ధమవుతోందని అందరూ అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించిన తర్వాత నటి Vijayashanti మళ్ళీ సినిమాల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

Previous articleఈ హీరోయిన్ కి అప్పట్లోనే సొంత విమానం ఉండేదట.. కానీ ఇప్పుడు మాత్రం….
Next articleRussia vs Ukraine – సంకనాకించిన బైడెన్ – 24 గంటల్లో ఏం జరగబోతుంది ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here